భర్త చేతిలో భార్య హతం

ABN , First Publish Date - 2021-05-09T06:06:54+05:30 IST

మండలంలోని సొల్లాపురం గ్రా మంలో భర్త నాగభూషణం చేతిలో భార్య లక్ష్మీ (28) హత్యకు గురైంది.

భర్త చేతిలో భార్య హతం

 

కణేకల్లు, మే 8 : మండలంలోని సొల్లాపురం గ్రా మంలో భర్త నాగభూషణం చేతిలో భార్య లక్ష్మీ (28) హత్యకు గురైంది. ఎస్‌ఐ దిలీప్‌ కుమార్‌ తెలిపిన  వి వరాలివి. గ్రామానికి చెందిన నాగభూషణం కర్ణాటకలోని రాంపురం తాలుకా నాగసముద్రం గ్రామానికి చెందిన ల క్ష్మీని వివాహం చేసుకున్నారు. బతుకుతెరువు నిమిత్తం తాడిపత్రిలోని బండల ఫ్యాక్టరీలో పని చేసేవారు. ఇటీవ ల ఇద్దరి మధ్య మనస్ఫర్థలు రాగా లక్ష్మీ  పుట్టింటికి వెళ్లిపోయింది. శుక్రవారం నాగభూషణం నాగసముద్రంకు వెళ్లి లక్ష్మీ కుటుంబ సభ్యులను ఒప్పించి మరోసారి గొడ వ పడమని చెప్పి సొల్లాపురం తీసుకువచ్చాడు. శనివా రం ఉదయం ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరగ్గా, నాగభూషణం రోకలిబండతో లక్ష్మీ తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మీని ఉరవకొండ ఆస్పత్రికు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం నుంచి కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందు తూ ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసుకుని ద ర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


Updated Date - 2021-05-09T06:06:54+05:30 IST