భర్త కనిపించడం లేదని భార్య ఫిర్యాదు.. మద్యం మత్తులో షాకింగ్ విషయం బయటపెట్టిన కొడుకు!

ABN , First Publish Date - 2022-02-25T20:00:37+05:30 IST

తన భర్త కనిపించడం లేదని, అతణ్ని ఎలాగైనా కనిపెట్టాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది..

భర్త కనిపించడం లేదని భార్య ఫిర్యాదు.. మద్యం మత్తులో షాకింగ్ విషయం బయటపెట్టిన కొడుకు!

తన భర్త కనిపించడం లేదని, అతణ్ని ఎలాగైనా కనిపెట్టాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.. వారం వారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి గుర్తు చేసేది.. పోలీసులు ఎంతగా ప్రయత్నించినా అతని ఆచూకీ దొరకలేదు.. చివరకు ఆమె కొడుకు మద్యం మత్తులో స్నేహితుడికి అసలు విషయం చెప్పేశాడు.. తండ్రిని తామే చంపేసి శరీరంలోని ఒక్కో బాగాన్ని ఇంట్లో ఒక్కో ప్లేస్‌లో గోతులు తీసి పూడ్చేశామని చెప్పాడు.. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు సమీపంలోని ఉమ్రిఖేడా ప్రాంతంలో నివసించే మహిళ సునీతను భర్త బబ్లూ తరచుగా కొడుతూ ఉండేవాడు. మద్యం సేవించి భార్య పైనే కాకుండా కొడుకుపై కూడా ప్రతిరోజూ చేయి చేసుకునేవాడు. దీంతో ఈ నెల 5వ తేదీన సునీత, ఆమె కొడుకు కలిసి బబ్లూకు అన్నంలో మత్తు మందు కలిపి పెట్టారు. అతను స్పృహ తప్పగానే శరీరాన్ని ముక్కలుగా నరికేశారు. ఒక్కో భాగాన్ని ఇంట్లో ఒక్కో ప్లేస్‌లో పూడ్చి పెట్టేశారు. తర్వాతి రోజు ఉదయం సునీత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. 


పోలీసులు ఎంతగా వెతికినా బబ్లూ ఆచూకీ లభించలేదు. సునీత వారానికొకసారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్త గురించి అడిగేది. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం సునీత కొడుకు మద్యం సేవించి తన తండ్రిని తామే చంపేశామని స్నేహితుడికి చెప్పాడు. ఆ విషయం పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు సునీతను అదపులోకి తీసుకుని విచారించారు. ఆమె పోలీసుల ఎదుట నిజాన్ని అంగీకరించింది. పోలీసులు ఆ ఇంట్లో తవ్వకాలు జరిపి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సునీతను, ఆమె కొడుకును అదుపులోకి తీసుకున్నారు. 


Updated Date - 2022-02-25T20:00:37+05:30 IST