రక్తపుమడుగులో స్పృహ లేకుండా కనిపించిన భర్త.. పోలీసులకు భార్య ఫిర్యాదు.. విచారించగా అసలు విషయం తెలిసిపోయిందిలా..

ABN , First Publish Date - 2022-05-01T12:16:49+05:30 IST

రక్తపుమడుగులో స్పృహ లేకుండా కనిపించిన భర్త.. పోలీసులకు భార్య ఫిర్యాదు.. విచారించగా అసలు విషయం తెలిసిపోయిందిలా..

రక్తపుమడుగులో స్పృహ లేకుండా కనిపించిన భర్త..  పోలీసులకు భార్య ఫిర్యాదు.. విచారించగా అసలు విషయం తెలిసిపోయిందిలా..

  • భార్య చేతిలో అకౌంటెంట్‌ హతం.. 
  • వివాహేతర సంబంధమే కారణం

బెంగళూరు : బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న తిరుపతి జిల్లా నారాయణవనం సముదాయం గ్రామానికి చెందిన సిద్ధారెడ్డి కుమారుడు శంకర్‌రెడ్డి (35) దారుణహత్యకు గురయ్యాడు. యశ్వంతపుర పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పంపా మెయిన్‌రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్‌లో శంకర్‌రెడ్డి, ఢిల్లీరాణి దంపతులు నివాసం ఉంటున్నారు. ఓ అపరిచితుడు ఇంట్లోకి ప్రవేశించి తన భర్తను హత్యచేసినట్టు శంకరరెడ్డి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఏ వస్తువులు చోరీ కాలేదని పోలీసులు గుర్తించారు. దాంతో ఢిల్లీరాణిపై నిఘా పెట్టారు. 


శంకర్‌రెడ్డి ఎనిమిదేళ్ల కిందట ఢిల్లీరాణిని పెళ్లి చేసుకున్నాడు. వీరి కి 6, 4 ఏళ్ల కుమారులున్నారు. కొన్నేళ్లుగా ఢిల్లీరాణి పుట్టింట్లోనే ఉండేది. శంకర్‌రెడ్డి బెంగళూరులో అకౌంటెంట్‌గా పనిచేసేవాడు. వారం క్రితం కొత్త ఇంట్లోకి వెళ్లా రు. ప్రస్తుతం భార్య, పిల్లలతోపాటు శంకర్‌రెడ్డి ఉన్నారు. గురువారం రాత్రి 12.30 గంటల తర్వాత ఆరేళ్ల కుమారుడు పక్కింటికి వెళ్లి సమాచారం ఇవ్వడంతో ఇంటి యజమాని రాజశేఖర్‌ వచ్చి పరిశీలించారు. శంకర్‌రెడ్డి రక్తపుమడుగులో పడిఉండగా.. ఆయన భార్య స్పృహ లేకుండా కనిపించారు. 


వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శనివారం ఢిల్లీరాణిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించడంతో వాస్తవం వెలుగులోకి వచ్చింది. భర్తను చాకుతో గొంతుకోసి హత్యచేసినట్లు అంగీకరించారు. ఈ సందర్భంగా ఆమె చేతికి స్వల్పంగా గాయమైంది. చిత్తూరు జిల్లాలోని ఓ యువకుడితో వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే హత్య చేసినట్లు తేలింది. నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు, ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2022-05-01T12:16:49+05:30 IST