పెళ్లైన 8 నెలల తర్వాత భర్తకు షాకిచ్చిన భార్య.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పరారీ..

ABN , First Publish Date - 2022-07-12T02:08:08+05:30 IST

ఆ యువకుడికి ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది.. అయితే ఆ వివాహం ఆ యువతికి ఇష్టం లేదు..

పెళ్లైన 8 నెలల తర్వాత భర్తకు షాకిచ్చిన భార్య.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పరారీ..

ఆ యువకుడికి ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది.. అయితే ఆ వివాహం ఆ యువతికి ఇష్టం లేదు.. తాను వేరొకరిని ప్రేమించానని, కుటుంబ సభ్యుల బలవంతం వల్ల ఈ పెళ్లి చేసుకున్నానని భర్తకు చెప్పింది.. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఇంటి నుంచి పారిపోయింది.. దీంతో ఆ వ్యక్తి తన భార్య గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హర్యానాలోని రోహ్‌తక్‌లో ఈ ఘటన జరిగింది.


ఇది కూడా చదవండి..

Crime: భార్య గొంతు కోసి చంపిన భర్త.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భార్య గురించి షాకింగ్ విషయాలు వెల్లడి..


ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళతో హర్యానాలోని రోహ్‌తక్‌కు చెందిన యువకుడికి 8 నెలల క్రితం వివాహం జరిగింది. అయితే ఆ వివాహం ఆ యువతికి ఇష్టం లేదు. కుటుంబసభ్యుల ఒత్తిడితోనే పెళ్లి చేసుకున్నానని భర్తకు చెప్పింది. తాను మరొకరిని ఇష్టపడుతున్నానని చెప్పింది. ఆదివారం మధ్యాహ్నం ఆ యువకుడు తన తండ్రితో కలిసి బంధువుల వివాహ వేడుకకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఇల్లు వదిలి వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి వెళ్లిన ఆ యువకుడు భార్య కోసం వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2022-07-12T02:08:08+05:30 IST