మూడో భర్తకు తన ప్రేమ నిరూపించుకోవడానికి 4 ఏళ్ల చిన్నారిని బలిచ్చిన మహిళ.. అలా ఎందుకు చేసిందంటే..

ABN , First Publish Date - 2022-02-09T05:35:26+05:30 IST

ఒక మహిళ తన జీవితంలో మూడు వివాహాలు చేసుకుంది. ఇటీవల మూడో భర్తతో ఆమెకు గొడవలు మొదలయ్యాయి. ఆమెకు మరెవరితోనే వివాహేతర సంబంధం ఉందని అతను అనుమానించేవాడు...

మూడో భర్తకు తన ప్రేమ నిరూపించుకోవడానికి 4 ఏళ్ల చిన్నారిని బలిచ్చిన మహిళ.. అలా ఎందుకు చేసిందంటే..

ఒక మహిళ తన జీవితంలో మూడు వివాహాలు చేసుకుంది. ఇటీవల మూడో భర్తతో ఆమెకు గొడవలు మొదలయ్యాయి. ఆమెకు మరెవరితోనే వివాహేతర సంబంధం ఉందని అతను అనుమానించేవాడు. దీంతో ఒకరోజు ఆమె తన పవిత్రత నిరూపించుకునేందుకు ఒక చిన్నారిని బలిస్తానని చెప్పింది. ఆ తరువాత ఏం చేసిందంటే..


వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన జయలక్షి(38) 19 ఏళ్ల క్రితం మొదటిసారి వివాహం చేసుకుంది. కానీ కొన్ని నెలలకే అతడిని వదిలేసి మొదటి భర్త తమ్ముడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. జయలక్ష్మికి రెండో భర్తతో ఒక కూతురు పుట్టింది. ఆ తరువాత రెండో భర్త మిత్రుడు పద్మానాభన్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది.


పద్మనాభన్ ఒక కారు డ్రైవర్. జయలక్ష్మిని అతడు తరుచూ తన కారులో షికారు కోసం తీసుకెళ్లేవాడు. అలా వారిద్దరు ప్రేమించుకున్నారు. ఇది తెలిసి జయలక్ష్మిని ఆమె రెండో భర్త వదిలేశాడు. ఆ తరువాత జయలక్ష్మి పద్మనాభన్‌ని మూడో వివాషం చేసుకొంది. అయితే గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. జయలక్ష్మికి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని పద్మనాభన్ అనుమానించేవాడు. ఒక రోజు ఇద్దరి మధ్య గొడవ బాగా జరిగింది. అప్పుడు జయలక్ష్మి తన ప్రేమ, పవిత్రతను నిరూపించుకునేందుకు ఒక శపథం చేసింది. తనకు రెండో భర్త ద్వారా పుట్టిన పాపను అగ్నికి ఆహుతి చేస్తానని చెప్పింది. వెంటనే గదిలో నిద్రపోతున్న పాపను తీసుకువచ్చి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. 


పాప అరుపులకు, మంటలకు, పక్కింటి వారు అక్కడ చేరుకొని పాపను ఆస్పత్రిక చేర్చారు. ఆస్పత్రిలో పాప చికిత్స పొందుతూ మరణించింది. పోలీసుల జయలక్ష్మిని పాప హత్య కేసులో అరెస్టు చేశారు.


Updated Date - 2022-02-09T05:35:26+05:30 IST