భర్త పుట్టిన రోజు క్రూరమైన బహుమతి ఇచ్చిన భార్య.. ఎంతో ప్రేమించిన భర్త వద్దకు ప్రియుడిని పంపి..

ABN , First Publish Date - 2022-04-29T06:25:12+05:30 IST

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. ఆమె గుండెజబ్బుతో బాధపడుతోందని తెలిసి కూడా అతను పెళ్లి చేసుకున్నాడు. మెరుగైన వైద్యం కోసం డెహ్రాడూన్ తీసుకెళ్లాడు. అక్కడ వైద్యుల వద్ద చికిత్స ప్రారంభించాడు. ఉద్యోగ రీత్యా తను ఇండోర్‌లో ఉండిపోయాడు.. డెహ్రాడూన్‌లో ఒంటరిగా ఉంటున్న భార్య ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో ప్రేమలో పడింది...

భర్త పుట్టిన రోజు క్రూరమైన బహుమతి ఇచ్చిన భార్య.. ఎంతో ప్రేమించిన భర్త వద్దకు ప్రియుడిని పంపి..

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. ఆమె గుండెజబ్బుతో బాధపడుతోందని తెలిసి కూడా అతను పెళ్లి చేసుకున్నాడు. మెరుగైన వైద్యం కోసం డెహ్రాడూన్ తీసుకెళ్లాడు. అక్కడ వైద్యుల వద్ద చికిత్స ప్రారంభించాడు. ఉద్యోగ రీత్యా తను ఇండోర్‌లో ఉండిపోయాడు.. డెహ్రాడూన్‌లో ఒంటరిగా ఉంటున్న భార్య ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో ప్రేమలో పడింది. అతడిని రెగ్యులర్‌గా కలుస్తుండేది.. చివరకు భర్త డెహ్రాడూన్ వచ్చేస్తున్నాడని తెలుసుకుని భయపడింది.. ప్రియుడితో కలిసి భర్తను చంపించేసింది.. భర్త బర్త్ డే రోజునే అతడిని ప్రియుడితో కలిసి భార్య హత్య చేసింది. చివరకు పోలీసులకు దొరికిపోయింది.


వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌కు చెందిన యశ్‌పాల్, పూజ చాలా ఏళ్ల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకున్నారు. పూజ హార్ట్ పేషెంట్ అని విషయం తెలిసినప్పటికీ, ఆమెను యశ్‌పాల్ వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఇద్దరూ ఇండోర్ వెళ్లారు. యశ్‌పాల్ ఇండోర్‌లోని ఒక కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. కొన్ని రోజుల తర్వాత పూజకు గుండె సమస్య పెరగడం మొదలైంది. కాబట్టి ఆమె చికిత్స కోసం డెహ్రాడూన్‌లోని తన బంధువల ఇంట్లో ఉండవలసి వచ్చింది. యశ్‌పాల్ ఇండోర్‌లోనే పనిచేస్తున్నాడు. 


అప్పుడప్పుడు భార్యను చూసేందుకు డెహ్రాడూన్ వెళ్లేవాడు. పూజకు ఫేస్ బుక్ ద్వారా కరణ్ అనే యువకుడు పరిచయమయ్యాడు. కొన్ని రోజుల కబుర్లు తర్వాత ఇద్దరూ దగ్గరయ్యారు. కరణ్ కూడా వివాహితుడే. రోజూ మాట్లాడుకుంటూ కరణ్, పూజ ప్రేమలో పడ్డారు. తరచుగా కలుసుకునేవారు. ఈ లోగా యశ్‌పాల్ డెహ్రాడూన్లో తన ఉద్యోగం ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. తన భార్య పూజకు ఆ శుభవార్త చెప్పాడు. దీంతో ఆమెలో దిగులు ప్రారంభమైంది. భర్త డెహ్రాడూన్ వస్తే ప్రియుడిని కలవడం కుదరదని బాధపడింది. ఆ విషయాన్ని బాయ్‌ఫ్రెండ్‌ కరణ్‌కి చెప్పింది. 


దీంతో ఇద్దరూ కలిసి యశ్‌పాల్‌ని చంపాలను నిర్ణయించుకున్నారు. అందుకోసం ముందుగా పూజ.. తన ప్రియుడిని భర్తకు ఒక స్నేహితుడి రూపంలో పరిచయం చేసింది. కరణ్ తన స్నేహితుడని.. పని మీద ఇండోర్ వస్తున్నాడని చెప్పింది. అలాగే కరణ్ చేత యశ్‌పాల్ పుట్టినరోజు బహుమతి పంపిస్తున్నానని తెలిపింది. దీంతో కరణ్ కోసం యశ్‌పాల్ కొన్ని రోజులు ఇండోర్ లోనే ఆగిపోయాడు. ఆ తరువాత కరణ్ ఇండోర్ వెళ్లి యశ్‌పాల్‌ పుట్టిన రోజున అతడి రూమ్‌లోనే గొంతు కోసి చంపేశాడు. యశ్‌పాల్‌ హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఫోన్ కాల్స్‌ను ట్రేస్ చేయగా.. హత్య జరిగిన సమయంలో ఘటనా స్థలంలో కరణ్ ఉన్నట్టు తేలింది. కరణ్ ఫోన్ వివరాలు బయటకు తీయగా అతను డెహ్రాడూన్‌కు చెందిన ఓ మహిళతో ఫోన్లో ఎక్కువగా మాట్లాడినట్టు బయటపడింది. విచారణలో ఆ మహిళ మృతుడు యశ్‌పాల్ భార్యేనని తేలింది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అసలు విషయం వెల్లడైంది. పోలీసలు హత్యకేసులో పూజను, కరణ్‌ను అరెస్ట్ చేశారు. 


Updated Date - 2022-04-29T06:25:12+05:30 IST