నా భర్తను చంపినందుకు నాకు బాధ లేదు.. అలా చేయడం తప్ప ఇంకో మార్గం లేదు.. పోలీసుల ఎదుట మహిళ సంచలన వాఖ్యలు!

ABN , First Publish Date - 2022-02-28T19:47:13+05:30 IST

భర్తను చంపేసి శరీరంలోని ఒక్కో బాగాన్ని ఇంట్లో ఒక్కో ప్లేస్‌లో గోతులు తీసి పూడ్చేసింది..

నా భర్తను చంపినందుకు నాకు బాధ లేదు.. అలా చేయడం తప్ప ఇంకో మార్గం లేదు.. పోలీసుల ఎదుట మహిళ సంచలన వాఖ్యలు!

భర్తను చంపేసి శరీరంలోని ఒక్కో బాగాన్ని ఇంట్లో ఒక్కో ప్లేస్‌లో గోతులు తీసి పూడ్చేసింది.. కొడుకు కూడా ఆమెకు సహకరించాడు.. ఆ విషయం బయటకు తెలియనివ్వలేదు.. అయితే మద్యం మత్తులో కొడుకు అసలు సంగతి బయటపెట్టేశాడు.. దీంతో పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు.. విచారణలో మహిళ చెప్పిన మాటలు విని పోలీసులే షాకయ్యారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. 


ఇండోర్‌కు సమీపంలోని ఉమ్రిఖేడా ప్రాంతంలో నివసించే సునీతను భర్త బబ్లూ తరచుగా కొడుతూ ఉండేవాడు. మద్యం సేవించి భార్య పైనే కాకుండా కొడుకుపై కూడా ప్రతిరోజూ చేయి చేసుకునేవాడు. వారికి రోజూ నరకం చూపించేవాడు. దీంతో ఈ నెల 5వ తేదీన సునీత, ఆమె కొడుకు కలిసి బబ్లూకు అన్నంలో మత్తు మందు కలిపి పెట్టారు. అతను స్పృహ తప్పగానే శరీరాన్ని ముక్కలుగా నరికేశారు. ఒక్కో భాగాన్ని ఇంట్లో ఒక్కో ప్లేస్‌లో పూడ్చి పెట్టేశారు. తర్వాతి రోజు ఉదయం సునీత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎంతగా వెతికినా బబ్లూ ఆచూకీ లభించలేదు.


సునీత కొడుకు మద్యం సేవించి తన తండ్రిని తామే చంపేశామని స్నేహితుడికి చెప్పాడు. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు సునీతను అదపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఆమె చెప్పిన మాటలు విని షాకయ్యారు. `నా భర్తను చంపినందుకు నాకేం బాధ లేదు. అది తప్ప మాకు ఇంకో మార్గం కనిపించలేదు. అతను మమ్మల్ని రోజూ హింసించేవాడు. మమ్మల్ని మనుషులుగా కూడా చూసేవాడు కాదు. మేం కష్టపడి సంపాదించిన డబ్బులతో తాగేసేవాడు. మేం తిండి లేక పస్తులున్నా పట్టించుకునే వాడు కాదు. ఇంట్లో సామాన్లు కూడా పట్టుకుపోయి అమ్ముకుని తాగేవాడు. తాగి వచ్చి నన్ను, నా కొడుకును కొట్టేవాడు. అందుకే అతడిని చంపేశామ`ని సునీత పోలీసులకు చెప్పింది. 


Updated Date - 2022-02-28T19:47:13+05:30 IST