ఫొటో షేర్ చేసిన రోహిత్ శర్మ.. ట్రోల్ చేసిన భార్య!
ABN , First Publish Date - 2021-03-01T10:29:30+05:30 IST
టీమిండియా హిట్మ్యాన్ రోహిత్ శర్మ షేర్ చేసిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఉన్న రోహిత్..
అహ్మదాబాద్: టీమిండియా హిట్మ్యాన్ రోహిత్ శర్మ షేర్ చేసిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఉన్న రోహిత్.. ప్రాక్టీస్ సందర్భంగా మైదానంలో పచ్చికపై పడుకొని ఉన్న ఫొటోను షేర్ చేశాడు. దానికి ‘పిచ్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నా’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ ఫొటో చూసిన రోహిత్ భార్య రితిక అతన్ని ట్రోల్ చేసింది. ఆ ఫొటోకు రిప్లై ఇస్తూ.. ‘మళ్లీ నేను బద్దకంగా ఉంటే ఎగతాళి చేస్తావ్’ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ రెండు పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.