ప్రియుడితో కలిసి నిద్రపోతున్న భర్తపై అటాక్.. అదే టైమ్లో పెద్దకూతురు మేల్కొనడంతో..
ABN , First Publish Date - 2020-10-29T19:38:11+05:30 IST
ప్రియుడితో కలిసి అంధుడైన భర్తను చంపాలని ప్రయత్నించిందో ఓ వివాహిత. పదకొండు సంవత్సరాలుగా మేదరమెట్ల యానాది కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న తొట్టెంపూడి పూర్ణచంద్రరావు
ప్రియుడితో కలిసి భర్తపై భార్య హత్యాయత్నం
మేదరమెట్ల (ప్రకాశం జిల్లా): ప్రియుడితో కలిసి అంధుడైన భర్తను చంపాలని ప్రయత్నించిందో ఓ వివాహిత. పదకొండు సంవత్సరాలుగా మేదరమెట్ల యానాది కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న తొట్టెంపూడి పూర్ణచంద్రరావు భార్యతో కలిసి స్థానికంగానే నివాసముంటున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. మేదరమెట్ల గ్రామానికి చెందిన సురేష్ ఇంట్లో గతంలో వీరు అద్దెకు ఉన్నారు. కొన్నాళ్ల తర్వాత స్థానికంగా నిర్మించిన ఒక అపార్ట్మెంట్లో ప్లాట్ కొని అందులోకి మారారు. కాగా బుధవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న పూర్ణచంద్రరావును ఆయన భార్య, ప్రియుడు సురేష్ కలిసి హత్య చేయాలనే ఉద్దేశంతో ముఖంపై దిండు ఉంచి ఊపిరి ఆడకుండా చేసేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో అతని పెద్ద కూతురు మేల్కొని కేకలు వేయడంతో సురేష్ అక్కడి నుంచి పారిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భార్య సురే్షతో వివాహేతర సంబంధం నడుపుతూ తనను అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ వేసిందని, సోదరుని సహాయంతో పూర్ణచంద్రరావు ఫిర్యాదు చేశారు. మేదరమెట్ల ఎస్ఐ కట్టా అనూక్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.