Bihar: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించిన భార్యపై ఆగ్రహం పెంచుకున్న భర్త.. చివరకు ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే..
ABN , First Publish Date - 2022-08-29T02:24:03+05:30 IST
ఆ వ్యక్తి మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు.. ఆ భార్యను నిర్లక్ష్యం చేసి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
ఆ వ్యక్తి మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు.. ఆ భార్యను నిర్లక్ష్యం చేసి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.. ఆ సంబంధం గురించి భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి.. దాంతో భార్యను గొంతు నులిమి చంపేశాడు.. అనంతరం మొదటి భార్య కొడుకులతో కలిసి రెండో భార్య మృతదేహాన్ని తన ఇంటి సెప్టిక్ ట్యాంక్లోనే దాచాడు.. చివరకు అసలు విషయం బయటపడడంతో పరారయ్యాడు. బీహార్ (Bihar)లోని పూర్నియాలో ఈ దారుణం వెలుగు చూసింది.
ఇది కూడా చదవండి..
Marriage: పొదల చాటున కూర్చున్న ప్రేమ జంటను పట్టుకున్న స్థానికులు.. రక్తంతో అమ్మాయికి బొట్టు పెట్టిన అబ్బాయి.. చివరకు..
పూర్నియాకు చెందిన శ్యామ్లాల్ చౌరాసియా అనే వ్యక్తి మొదటి భార్య చనిపోవడంతో రింకీ దేవి అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే అతనికి మొదటి భార్య వల్ల ముగ్గురు కొడుకులు పుట్టారు. రెండో భార్యతో సక్రమంగా కాపురం చేయకుండా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ సంబంధం గురించి రింకీ దేవికి తెలిసి భర్తతో తరచుగా గొడవ పడేది. తీవ్ర ఆగ్రహానికి గురైన శ్యామ్లాల్ ఈ నెల 12వ తేదీన ఆమె గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని కొడుకుల సహాయంతో తన ఇంటి సెప్టిక్ ట్యాంకులో పడేశాడు.
తమ కూతురు కనిపించకపోవడంతో రింకీ దేవి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. శ్యామ్లాల్ కుమారులను కూడా విచారించారు. ఆ విచారణలో శ్యామ్లాల్ రెండో కుమారుడు అసలు విషయం బయటపెట్టాడు. రింకీ దేవిని తన తండ్రే హత్య చేశాడని, మృతదేహాన్ని తామందరం కలిసి సెప్టిక్ ట్యాంకులో దాచామని చెప్పేశాడు. దీంతో పోలీసులు గొయ్యి తవ్వి మృతదేహాన్ని వెలికి తీశారు. శ్యామ్లాల్ ముగ్గురు కొడుకులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న శ్యామ్లాల్ కోసం గాలిస్తున్నారు.