డీసీఎంతో ఢీకొట్టి.. గొంతు నులిమి.. ఓ ఇల్లాలి కుట్ర

ABN , First Publish Date - 2020-06-30T22:39:18+05:30 IST

భార్యాభర్తల మధ్య సంబంధాలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. కలకాలం కలిసి జీవించాల్సిన వాళ్లు మధ్యలో వదిలించుకుంటున్నారు. క్షణిక సుఖం

డీసీఎంతో ఢీకొట్టి.. గొంతు నులిమి.. ఓ ఇల్లాలి కుట్ర

మేడ్చల్: భార్యాభర్తల మధ్య సంబంధాలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. కలకాలం కలిసి జీవించాల్సిన వాళ్లు మధ్యలోనే వదిలించుకుంటున్నారు. క్షణిక సుఖం కోసం బంధాలనే తెంచుకుంటున్నారు. ప్రియుడి మీద వ్యామోహమో.. ఇంకెంటో తెలియదు గానీ.. ప్రియుడితో ఉండడానికి భర్త అడ్డుగా ఉన్నాడని ఏకంగా కట్టుకున్న భర్తనే కాటికి పంపించింది ఓ దుర్మార్గురాలు. ఈ దారుణ ఘటన మేడ్చల్‌లో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళ్తే...

మేడ్చల్ పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసిన ప్రీప్లాన్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. సైదొని గడ్డ తండాకు చెందిన సురేష్, బబిత భార్యాభర్తలు. బబిత సైదోనిగడ్డ గ్రామ ‌7వ వార్డు మెంబర్. ఆమెకు‌ దుండిగల్ తండాకు చెందిన ప్రేమ్‌సింగ్‌కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఎలాగైనా భర్త సురేష్‌ను అడ్డు తొలగించుకోవాలని మే నెలలో బబిత.. ఆమె ప్రియుడు ప్రేమ్‌సింగ్ కుట్ర పన్నారు. ప్రేమ్‌సింగ్ తన స్నేహితులతో కలిసి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. సురేష్.. భారత్ బయోటక్‌లో విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా యాడారం వద్ద  మే 23న డీసీఎం వాహనంతో ఢీకొట్టారు. ప్రమాదంగా చిత్రీకరించి ఆస్పత్రికి కారులో తరలిస్తున్నట్లు నటించి దారిలోనే గొంతు పిసికి ప్రాణాలు తీశారు. మృతుడి కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు మిస్టరీని ఛేదించారు. ఈ దారుణ సంఘటనలో మృతుడి భార్య బబిత, ప్రియుడు ప్రేమ్‌సింగ్‌తో పాటు మరో ముగ్గురిని నిందితులుగా నిర్ధారించారు. వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. మరో నలుగురు పరారీలో ఉన్నారని బాలానగర్ డీసీపీ తెలిపారు.







Updated Date - 2020-06-30T22:39:18+05:30 IST