సాగు చట్టాలు రద్దు చేసేంత వరకూ వెనక్కి తగ్గం: టికాయత్

ABN , First Publish Date - 2021-07-22T01:00:57+05:30 IST

కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకునేంత వరకూ రైతుల..

సాగు చట్టాలు రద్దు చేసేంత వరకూ వెనక్కి తగ్గం: టికాయత్

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకునేంత వరకూ రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేష్ టికాయత్ తెలిపారు. సాగు చట్టాల రద్దు డిమాండ్‌పై ఎనిమిది నెలలుగా జరుపుతున్న ఆందోళనకు కొనసాగింపుగా జంతర్‌మంతర్‌ వద్ద గురువారం నుంచి  'కిసాన్ పార్లమెంటు'ను రైతు సంఘాలు నిర్వహించనున్నాయి. దీనిపై టికాయత్ బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ, గురువారం 200 మంది రైతులు సింధు సరిహద్దు నుంచి నాలుగు బస్సుల్లో జంతర్ మంతర్ వెళ్తారని చెప్పారు. వివిధ నిరసన స్థలాల నుంచి అందరూ సింధు సరిహద్దుకు చేరుకుని అక్కడ్నించి జంతర్ మంతర్ వెళ్తారని తెలిపారు. సాగు చట్టాలను కేంద్ర వెనక్కి తీసుకునేంత వరకూ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని, జంతర్ మంతర్ వద్ద ఆందోళన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసేంత వరకూ ఉంటుందన్నారు. ఎంతకాలం రైతు ఆందోళన సాగినా ప్రశాంతంగా, సరైన పద్ధతిలోనే సాగుతుందని తెలిపారు.

Updated Date - 2021-07-22T01:00:57+05:30 IST