వెండి మంచం.. బంగారపు గ్లాసులు, కంచాలు... ఈ హోటల్ లో ఒక్క రాత్రికి అయ్యే ఖర్చు ఎంతంటే..

ABN , First Publish Date - 2022-01-01T15:57:43+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు..

వెండి మంచం.. బంగారపు గ్లాసులు, కంచాలు... ఈ హోటల్ లో ఒక్క రాత్రికి అయ్యే ఖర్చు ఎంతంటే..

ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని అంటాయి. దేశంలో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన రాజస్థాన్‌లో నూతన సంవత్సరం సందర్భంగా విదేశీ పర్యాటకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేశంలోనే అత్యంత ఖరీదైన హోటల్‌గా పేరొందిన ‘ది రాజ్ ప్యాలెస్’ లో న్యూఇయర్ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఆసియాలోనే అత్యంత వైభవంగా నూతన సంవత్సర వేడుకలు ‘ది రాజ్ ప్యాలెస్’లో జరుగుతాయని చెబుతుంటారు. 


 ఈ హోటల్‌లో ఒకరోజు రాత్రి బస చేయాలంటే రూ. 18 లక్షల అద్దె చెల్లించాల్సివుంటుంది. అత్యంత ఆధునిక సదుపాయాలు కలిగిన ఈ హోటల్‌లో బస చేసేవారికి వైభవమైన అతిథి మర్యాదలు చేస్తారు. ప్రత్యేక ఆహారాలను బంగారపు పళ్లాలలో వడ్డిస్తారు. హాటల్‌లో బస చేసే అతిథులకు సత్కారాలు చేసేందుకు ఐదుగురు సిబ్బంది నిరంతరం పనిచేస్తుంటారు. అతిథుల కోసం కళాకారులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అలాగే వారిని అంత్యంత విలాసవంతమైన వింటేజ్ కారులో కూర్చోబెట్టి రాజస్థాన్ అందాలను చూపిస్తారు. అలాగే ఎలిఫెంట్ సవారీ కూడా చేయిస్తారు. లేక్‌సిటీగా పేరొందిన ఉదయ్‌పూర్‌లో కూడా నూతన సంవత్సర వేడుకలు వైభవంగా జరిగాయి.

Updated Date - 2022-01-01T15:57:43+05:30 IST