‘రాజు కుటుంబాన్ని ఆదుకుంటాం’

ABN , First Publish Date - 2021-01-17T04:47:47+05:30 IST

అనారోగ్యంతో బాదపడుతున్న బోయరాజు కుటుంబాన్ని ఆదుకుంటామని మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరెడ్డి అన్నారు.

‘రాజు కుటుంబాన్ని ఆదుకుంటాం’


ఎమ్మిగనూరు, జనవరి 16: అనారోగ్యంతో బాదపడుతున్న బోయరాజు కుటుంబాన్ని ఆదుకుంటామని మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరెడ్డి అన్నారు. శనివారం 17వార్డులో అనారోగ్యంతో బాధపడుతున్న బీవీ ఆటో యూనియన్‌ ఆటో డ్రైవర్‌ బోయరాజుకు ఆర్థికసాయం అందజేశారు. కేఎండీ ఫరూక్‌, దయాసాగర్‌, ముల్లాకఇముల్లా, గౌస్‌,జయన్న, నవాజ్‌ పాల్గొన్నారు. 


సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం: మాజీ ఎమ్మెల్యే 

ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నారు. శనివారం 17వార్డులో పర్యటించి, సమస్యలను  తెలుసుకున్నారు. దయాసాగర్‌, ముల్లాకలిముల్లా, జయన్న, గౌస్‌, తేజ, వార్డు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


 టీడీపీ కనకవీడు గ్రామ కమిటీ ఏర్పాటు

నందవరం, జనవరి 16: మండలంలో టీడీపీ కనకవీడు గ్రామ కమిటీని  ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వ రరెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఎంపిక చేశారు. అధ్యక్షుడిగా రఘమార్తి స్వామి, ఉపాఽధ్యక్షుడిగా రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా లక్ష్మన్న, సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రఘుమార్తి మాట్లాడుతూ బీవీ తనను నమ్మి అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.



Updated Date - 2021-01-17T04:47:47+05:30 IST