అమెరికన్ల కోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమం: బైడెన్

ABN , First Publish Date - 2021-02-26T19:10:18+05:30 IST

కరోనా టీకాలను తేలికగా తీసుకుంటున్న అమెరికన్ల కోసం వాటిపై అవగాహన కలిగించే ఉద్దేశంతో త్వరలోనే ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ తెలియజేశారు.

అమెరికన్ల కోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమం: బైడెన్

వాషింగ్టన్: కరోనా టీకాలను తేలికగా తీసుకుంటున్న అమెరికన్ల కోసం వాటిపై అవగాహన కలిగించే ఉద్దేశంతో త్వరలోనే ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ తెలియజేశారు. తన పరిపాలన విభాగం ప్రస్తుతం ఈ విషయమై కసరత్తు చేస్తున్నట్లు అధ్యక్షుడు తెలిపారు. త్వరలోనే ఈ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ద్వారా వ్యాక్సిన్లపై ప్రజల్లో అవగాహన కల్పించడమే తాము నిర్వహించబోయే ఈ ప్రచార కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని బైడెన్ స్పష్టం చేశారు. కరోనా టీకాలపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, వ్యాక్సిన్లు తీసుకునేలా వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. 


ఇప్పటికే దేశవ్యాప్తంగా 5లక్షలకు పైగా మంది మహమ్మారికి బలయ్యారని, మునుముందు ఈ సంఖ్య పెరగకుండా ఉండాలంటే టీకాలే శరణ్యమని అన్నారు. కనుక ప్రజలు వ్యాక్సిన్ల పట్ల నిర్లక్ష్యం చూపకపోవడం మంచిదన్నారు. కరోనా నుంచి మనల్ని కాపాడే ఏకైక ఆయుధం వ్యాక్సిన్ మాత్రమేనని ఈ సందర్భంగా బైడెన్ స్పష్టం చేశారు. అందుకే అమెరికన్లలో టీకాలపై ఉన్న అపోహలను తొలగించి, వాటినే తీసుకునేలా ప్రోత్సహించడం కోసం ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. 

Updated Date - 2021-02-26T19:10:18+05:30 IST