జలంధర్లో దేశంలోనే అతిపెద్ద క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తాం: కేజ్రీవాల్
ABN , First Publish Date - 2021-12-16T00:41:31+05:30 IST
జలంధర్లో దేశంలోనే అతిపెద్ద క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తాం: కేజ్రీవాల్
జలంధర్: పంజాబ్ రాష్ట్రం జలంధర్లో దేశంలోనే అతిపెద్ద క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం అన్నారు. పంజాబ్లో ఆప్ అధికారంలోకి వస్తే జలంధర్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. "మనం పోరాటంలో గెలవాలని, పంజాబ్ సంతోషం కోసం 2022 మార్చిలో ఆప్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని జలంధర్ లో నిర్వహించిన రోడ్షోలో సీఎం కేజ్రీవాల్ ప్రజలకు పిలుపునిచ్చారు.