కట్నం డబ్బులు తీసుకురాలేదని భార్య అశ్లీల వీడియోను YouTubeలో పెట్టిన భర్త

ABN , First Publish Date - 2022-04-30T13:58:09+05:30 IST

రాజస్థాన్ రాష్ట్రంలో తాజాగా దారుణం వెలుగుచూసింది...

కట్నం డబ్బులు తీసుకురాలేదని భార్య అశ్లీల వీడియోను YouTubeలో పెట్టిన భర్త

భార్యపై బంధువులతో అత్యాచారం చేయించి...వీడియో తీసి...

భరత్‌పూర్ (రాజస్థాన్): రాజస్థాన్ రాష్ట్రంలో తాజాగా దారుణం వెలుగుచూసింది.పుట్టింటి నుంచి కట్నం తీసుకురాలేదన్న కోపంతో అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యపై బంధువులతో అత్యాచారం చేయించి, దాన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన భర్త బాగోతం రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్‌పూర్‌లో తాజాగా వెలుగుచూసింది.భరత్‌పూర్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి హర్యానాకు చెందిన మహిళను 2019లో వివాహం చేసుకున్నాడు. వివాహం సందర్భంగా అత్తింటివారు అల్లుడికి రూ.1.5లక్షల కట్నం ఇవ్వలేక పోవడంతో అత్తింటివారు కట్నం కోసం కోడలిని వేధిస్తుండే వారు. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే భార్యకు మాయమాటలు చెప్పి భర్త తన ఇంటికి తిరిగి తీసుకువచ్చాడు. ఆపై తన ఇద్దరు సమీప బంధువులను పిలిచి వారితో తన భార్యపైనే అత్యాచారం చేయించాడు. అత్యాచారం ఘటనను భర్తే తన ఫోన్ లో రికార్డు చేశాడు. 


‘‘మీ కుటుంబ సభ్యులు నాకు కట్నం ఇవ్వలేకపోయారు, కానీ ఇప్పుడు ఈ అశ్లీల వీడియోను యూట్యూబ్‌లో పెట్టడం ద్వారా నేను కట్నం డబ్బులు సంపాదిస్తాను’’ అని పేర్కొంటూ అశ్లీల వీడియోను తన భర్త యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడని బాధితురాలు ఆరోపించారు. నిందితుల వద్ద నుంచి తప్పించుకొని పుట్టింటికి పారిపోయిన భార్య కీచక బాగోతం, అశ్లీల వీడియో చిత్రీకరణపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.బాధితురాలి ఫిర్యాదు మేర తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని భరత్‌పూర్‌లోని కమాన్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ దౌలత్ సాహు చెప్పారు. 


Updated Date - 2022-04-30T13:58:09+05:30 IST