కుప్పం ప్రజలకు సేవ చేస్తా

ABN , First Publish Date - 2021-11-27T06:37:47+05:30 IST

కుప్పం ప్రజలకు సేవ చేస్తానని ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన భరత్‌ పేర్కొన్నారు.

కుప్పం ప్రజలకు సేవ చేస్తా
కుటుంబీకులతో కలిసి ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న భరత్‌

ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన భరత్‌ 


చిత్తూరు (సెంట్రల్‌), నవంబరు 26: కుప్పం ప్రజలకు సేవ చేస్తానని ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన భరత్‌ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారంతో ముగిసింది. దీంతో కలెక్టరేట్‌లోని జేసీ సమావేశ మందిరంలో ఆర్వో రాజాబాబు ఎమ్మెల్సీగా భరత్‌ ఏకగ్రీవమైనట్లు అధికారిక ప్రకటన చేశారు. కుటుంబ సభ్యులతో వచ్చిన ఆయన ఆర్వో నుంచి ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. అనంతరం భరత్‌ మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్‌రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడంతో పాటు వైసీపీకి రుణపడి ఉంటానని చెప్పారు. తనను ప్రోత్సహించిన సీఎంతోపాటు మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. 


Updated Date - 2021-11-27T06:37:47+05:30 IST