గిరిగ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా
ABN , First Publish Date - 2021-06-17T04:35:08+05:30 IST
గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషిచే స్తానని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. బుధవారం మండలం లోని గిరిజన గ్రామాలైన మురళీ గూడ, కమ్మర్గాం, గుండెపల్లి గ్రామాల్లో పర్యటించారు.
- ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
పెంచికలపేట, జూన్ 16: గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషిచే స్తానని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. బుధవారం మండలం లోని గిరిజన గ్రామాలైన మురళీ గూడ, కమ్మర్గాం, గుండెపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సంద ర్భంగా త్రీఫేస్ విద్యుత్లైన్ ఏర్పా టుకు భూమిపూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజనగ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమన్నారు. గిరిజన గ్రామాలకు అత్యవసర వైద్యసేవలు సకాలంలో అందజేసేందుకు ప్రత్యేక అంబులెన్స్ను త్వరలోనే అందజేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మురళీ గూడ సర్పంచ్ ఈశ్వరి బాయి భర్త శంకర్ అనారోగ్యంతో ఇటీవల మృతిచెం దగా ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. శంకర్ కుటుంబానికి ఎళ్లవేళలా అండగా ఉంటా మని, కూతురు వివాహానికి రెండు లక్షల రూపాయలు అందజేస్తామన్నారు. పిల్లల చదువు లకు కూడా సహకారం అందిస్తామని తెలిపారు. అలాగే ఇటీవల కరోనాతో మృతిచెందిన జున్గరి రమేష్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాడ సాను భూతి తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్లు శ్రీనివాస్, రాజన్న, మధునయ్య,ఎంపీటీసీలు శారద, రాజన్న, నాయకులు తిరుపతి, రాజన్న, వెంకటి, బండన్న, సాజిత్, కొండయ్య, ఖైరాత్ ఉన్నారు.