టీడీపీ బలోపేతానికి కృషి చేస్తా

ABN , First Publish Date - 2021-12-04T05:11:03+05:30 IST

తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని ఆలూరు నియోజకవర్గ మాజీ టీడీపీ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్‌ అన్నారు.

టీడీపీ బలోపేతానికి కృషి చేస్తా

  1. ఆలూరు నియోజకవర్గ  మాజీ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్‌


ఆలూరు, డిసెంబరు 3: తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని ఆలూరు నియోజకవర్గ మాజీ టీడీపీ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్‌ అన్నారు. శుక్రవారం ఆలూరు పట్టణంలో తన వ్యక్తిగత కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదేళ్లపాటు ఇన్‌చార్జిగా పని చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పారు. ఆలూరు ప్రాంతంలో పత్తి జిన్నింగ్‌ పరిశ్రమ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. తాను టీడీపీలోనే ఉన్నానని, బీజేపీలోకి చేరుతానని కొందరు ఓర్వలేక దుష్ప్రచారం చేశారని అన్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాలే తనకు శిరోధార్యమన్నారు. అలాగే తనను నమ్ముకున్న కార్యకర్తలు, అభిమానులను కాపాడుకుంటానని చెప్పారు. కార్యాలయం ఏర్పాటులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు. పార్టీ అభివృద్ధికి తాను శాయశక్తులా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ కురువ జయరాం, యువనాయకులు గిరి, మల్లేష్‌గౌడ్‌, హొళగుంద టీడీపీ కన్వీనర్‌ వీరన్నగౌడ్‌, మాజీ సర్పంచ్‌ వెంకటేష్‌, మాజీ ఎంపీటీసీ మల్లికార్జునగౌడ్‌, నాయకులు రవి, వన్నూర్‌వలీ, వెంకటస్వామి, కత్తి రామాంజనేయులు, బంగారు రామకృష్ణ, నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-04T05:11:03+05:30 IST