నా కాలేజీని ప్రభుత్వానికి రాసిస్తా: మంత్రి పువ్వాడ

ABN , First Publish Date - 2022-04-24T01:50:37+05:30 IST

పీజీ మెడికల్‌ సీట్ల ఆరోపణలపై మంత్రి పువ్వాడ

నా కాలేజీని ప్రభుత్వానికి రాసిస్తా: మంత్రి పువ్వాడ

హైదరాబాద్: పీజీ మెడికల్‌ సీట్ల ఆరోపణలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. తనపై గవర్నర్‌కు రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేయడాన్ని ఆయన ఖండించారు. బ్లాక్‌ దందా నిరూపిస్తే తన కాలేజీని ప్రభుత్వానికి రాసిస్తానని ఆయన సవాల్ విసిరారు. రేవంత్‌ తన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే రేవంత్‌రెడ్డి ముక్కునేలకు రాసి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే చర్యలు తీసుకుంటామని రేవంత్‌ను మంత్రి హెచ్చరించారు.

Updated Date - 2022-04-24T01:50:37+05:30 IST