గోవాలో బీజేపీ ప్రభుత్వం.. మరోసారి సీఎంగా ప్రమోద్ !

ABN , First Publish Date - 2022-03-10T20:16:42+05:30 IST

ఈ నేపథ్యంలో గోవా సీఎంగా ఎవరు ఎన్నికవుతారు అనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే, తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం సీఎంగా కొనసాగుతున్న ప్రమోద్ సావంత్ ఈసారి కూడా ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు.

గోవాలో బీజేపీ ప్రభుత్వం.. మరోసారి సీఎంగా ప్రమోద్ !

గోవాలో అత్యధిక సీట్లు సాధించబోతున్న పార్టీగా బీజేపీ నిలిచింది. దీంతో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడం దాదాపు ఖాయం. ఈ నేపథ్యంలో గోవా సీఎంగా ఎవరు ఎన్నికవుతారు అనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే, తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం సీఎంగా కొనసాగుతున్న ప్రమోద్ సావంత్ ఈసారి కూడా ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. ఇప్పటికే సావంత్.. సాంకెలిమ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో అప్పటి ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరణం తర్వాత, ప్రమోద్ సావంత్ గోవా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. పారికర్‌లాంటి అనుభవమున్న నేతను మరిపించే పాలన చేయడం ఒక సవాలే. అయితే, మెల్లిమెల్లిగా ప్రమోద్ పాలనలో తన మార్కు కొనసాగేలా చేశాడు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి ప్రధాన నేతగా ఉంటూ అత్యధిక సీట్లు గెలుచుకునేలా చేశాడు. ఈ నేపథ్యంలో ప్రమోద్‌నే తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ నిర్ణయించినట్లు సమాచారం. 

Updated Date - 2022-03-10T20:16:42+05:30 IST