సీఎం కేసీఆర్ స్ఫూర్తితోనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్: MP Santhosh Kumar

ABN , First Publish Date - 2022-05-29T23:51:00+05:30 IST

Hyderabad: ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్, సేవ్ సాయిల్ ఉద్యమం’ సంయుక్తంగా హైదరాబాద్‌ శిల్పారామంలో ‘లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ - మట్టి కోసం మనం’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ముఖ్య

సీఎం కేసీఆర్ స్ఫూర్తితోనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్: MP Santhosh Kumar

Hyderabad: ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్, సేవ్ సాయిల్ ఉద్యమం’ సంయుక్తంగా హైదరాబాద్‌ శిల్పారామంలో ‘లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్  - మట్టి కోసం మనం’ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ముఖ్య అతిథిగా తెలంగాణ పార్లమెంట్ సభ్యులు జె. సంతోష్ కుమార్ హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చాలా ఏళ్లుగా మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తోందని, సీఎం కేసీఆర్ స్ఫూర్తితోనే  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించామని చెప్పారు. మట్టి  కోసం మనం కార్యక్రమంలో భాగంగా ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ సద్గురు దేశంలోని 9 రాష్ట్రాల్లో బైక్ రైడ్‌ను కొనసాగిస్తారని, హైదరాబాద్‌కు జూన్ 15వ తేదీన  వస్తారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. గాయకులు మంగ్లీ, రామ్ మిరియాల, రమ్య బెహ్రా, సాహితీ చాగంటి, శ్రీ లలిత సందీప్‌ పాడిన పాటలు అలరించాయి. కార్యక్రమంలో పద్మశ్రీ వెంకటేశ్వరరావు, ఆర్గానిక్ రైతు నాగరత్నం నాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-29T23:51:00+05:30 IST