మీతో వసంతం వచ్చింది: రాహుల్‌తో రౌత్

ABN , First Publish Date - 2021-12-14T22:43:29+05:30 IST

లోక్‌సభా కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సహా ఇతర పార్టీల ప్రముఖులు రాహుల్‌కు ముందే 12 ఎంపీలు ఆందోళన చేస్తున్న గాంధీ విగ్రహం దగ్గరికి చేరుకున్నారు. ఇంతలో రాహుల్ రాగానే.. సంజయ్ రౌత్ ఎదురువెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి కౌగిళించుకున్నారు..

మీతో వసంతం వచ్చింది: రాహుల్‌తో రౌత్

న్యూఢిల్లీ: ‘మీరొచ్చారు.. మీతో పాటు వసంతం వచ్చింది’ అని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో శివసేన సీనియర్ లీడర్ సంజయ్ రౌత్ అన్నారు. మంగళవారం పార్లమెంట్ ఆవరణలో రాహుల్‌ను కలిసిన సందర్భంలో రౌత్ ఈ వ్యాఖ్య చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదట్లోనే రాజ్యసభ నుంచి 12 ఎంపీలను సస్పెండ్ చేశారు. కాగా, ఆరోజు నుంచి సస్పెండ్ అయిన ఆ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. వీరిని గతంలోనే ఒకసారి కలిసి పరామర్శించిన రాహుల్ గాంధీ.. తాజాగా మరోసారి కలిసి పలకరించారు.


లోక్‌సభా కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సహా ఇతర పార్టీల ప్రముఖులు రాహుల్‌కు ముందే 12 ఎంపీలు ఆందోళన చేస్తున్న గాంధీ విగ్రహం దగ్గరికి చేరుకున్నారు. ఇంతలో రాహుల్ రాగానే.. సంజయ్ రౌత్ ఎదురువెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి కౌగిళించుకున్నారు. అనంతరం ‘మీరొచ్చారు.. మీతో పాటు వసంతం వచ్చింది’ అంటూ రాహుల్‌ను పొగిడారు. కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీతో శివసేన సన్నిహితంగా ఉంటూ వస్తోంది. కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని సంజయ్ రౌత్ కలుసుకున్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ లేకుండా బీజేపీ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడం సాధ్యం కాదని సంజయ్ రౌత్ ఎడిటర్‌గా ఉన్న శివసేన అధికారిక పత్రిక సామ్నాలో సంపాదకీయం రాయడం గమనార్హం.

Updated Date - 2021-12-14T22:43:29+05:30 IST