పన్నుల పెంపు జీవోలు ఉపసంహరించుకోండి

ABN , First Publish Date - 2020-12-04T04:45:21+05:30 IST

పన్నులు పెంచేందుకు జారీ చేసిన 196, 197, 198 జీవోలు తక్షణమే ప్రభుత్వం ఉపసంహారించుకోవాలని సిటిజన్‌ ఫోరం నాయకులు డిమాండ్‌ చేశారు.

పన్నుల పెంపు జీవోలు ఉపసంహరించుకోండి
కమిషనర్‌కు వినతిపత్రం అందిస్తున్న సిటిజన్‌ ఫోరం నాయకులు



పన్నుల పెంపు జీవోలు ఉపసంహరించుకోండి

ఆమదాలవలస: పన్నులు పెంచేందుకు జారీ చేసిన 196, 197, 198 జీవోలు తక్షణమే ప్రభుత్వం ఉపసంహారించుకోవాలని సిటిజన్‌ ఫోరం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం ఫోరం నాయకులు బి.మోహనరావు, బి.జనార్దనరావు ఆధ్వర్యంలో ఆమదాలవలస మునిసిపల్‌ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మునిసిపల్‌ చట్టాలను సవరిస్తూ ఆస్తిపన్ను పెంచేందుకు జారీచేసిన ఆర్డినెన్స్‌తో పట్టణ ప్రజలపై భారంపడుతుందని ఫోరం నాయకులు ఆరోపించారు. కార్యక్రమంలో కూన సంజీవినాయుడు, కె.జనార్దనరావు, పి.వరహానరసింహాలు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-04T04:45:21+05:30 IST