Viral News: వాళ్లే ఈమె టార్గెట్.. ఇప్పటికే ఐదు పెళ్లిళ్లు.. మరో పెళ్లికి సిద్ధం అవుతుండగా..

ABN , First Publish Date - 2022-09-17T18:33:01+05:30 IST

ఒకటి, రెండు పెళ్లిళ్లు చేసుకుని.. మహిళలను మోసం చేసే మగాళ్లను కొందరు మహిళలు ఆదర్శంగా తీసుకుంటున్నారు. మేము ఏమైనా తక్కువ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. డబ్బులే లక్ష్యంగా నిత్యం ఒక వ్యక్తితో పెళ్లికి రెడీ అయిపోతున్నారు. తా

Viral News: వాళ్లే ఈమె టార్గెట్.. ఇప్పటికే ఐదు పెళ్లిళ్లు.. మరో పెళ్లికి సిద్ధం అవుతుండగా..

ఇంటర్నెట్ డెస్క్: ఒకటి, రెండు పెళ్లిళ్లు చేసుకుని.. మహిళలను మోసం చేసే మగాళ్లను కొందరు మహిళలు ఆదర్శంగా తీసుకుంటున్నారు. మేము ఏమైనా తక్కువ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. డబ్బులే లక్ష్యంగా నిత్యం ఒక వ్యక్తితో పెళ్లికి రెడీ అయిపోతున్నారు. తాజాగా ఇటువంటి మోసాలకు పాల్పడుతున్న మహిళనే పోలీసులు(Police) అరెస్టు చేశారు. ఇప్పటికే 5 పెళ్లిళ్లు చేసుకున్న ఆమె.. మరో పెళ్లికి రెడీ అవుతుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఇంతకూ ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది? ఆ మహానుబావురాలు పేరేంటి? అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


తమిళనాడు(Tamil nadu)కు చెందిన సౌమ్య అలియాస్ శబరి అనే మహిళ.. బీకాం వరకు చదువుకుంది. ఈమెకు కొన్నేళ్ల క్రితమే ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అయితే.. ఆ బంధాన్ని తెగ్గొట్టుకున్న సౌమ్య నిత్య పెళ్లి కూతురు అవతారం ఎత్తింది. చాలాకాలంగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారినే టార్గెట్‌గా చేసుకుని మోసాలకు పాల్పడుతోంది. ఇప్పటి వరకు ఐదుగురిని వివాహం(5 marriages) చేసుకుని డబ్బు, నగలతో ఉడాయించింది. వాటితో జల్సాలు చేసింది. తాజాగా ఆరో పెళ్లికి సిద్ధమైంది. ఓ ఆటో డ్రైవర్‌తో పెళ్లికి రెడీ అవుతున్న సమయంలో.. పోలీసులు సౌమ్యను అరెస్ట్ చేశారు. 

Updated Date - 2022-09-17T18:33:01+05:30 IST