13 నెలల క్రితమే పెళ్లి.. నిద్రమాత్రలు ఇచ్చి భర్త మర్మాంగాన్ని కోసిన భార్య.. ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతూనే దారుణం

ABN , First Publish Date - 2022-06-23T01:08:42+05:30 IST

ఆ యువతి ఒక వ్యక్తితో ప్రేమలో పడింది.. తల్లిదండ్రులు ఆమె ప్రేమను అంగీకరించలేదు..

13 నెలల క్రితమే పెళ్లి.. నిద్రమాత్రలు ఇచ్చి భర్త మర్మాంగాన్ని కోసిన భార్య.. ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతూనే దారుణం

ఆ యువతి ఒక వ్యక్తితో ప్రేమలో పడింది.. తల్లిదండ్రులు ఆమె ప్రేమను అంగీకరించలేదు.. వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేశారు.. అయినా ఆమె తన ప్రేమికుడిని మర్చిపోలేదు.. అతడితో తరచుగా ఫోన్లో మాట్లాడుతూ ఉండేది.. చివరకు భర్తను తీవ్రంగా గాయపరిచింది.. భర్తకు నిద్ర మాత్రలు మింగించి అతడు స్పృహ కోల్పోయాక అతడి మర్మంగాన్ని కోసేసింది.. తన ప్రియుడు ఫోన్లో చెబుతుండగా ఆమె ఆ ఘాతుకానికి పాల్పడింది.. చివరకు పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలైంది. 


ఇది కూడా చదవండి..

South Sudanలో దుష్ట సాంప్రదాయం.. ఆవుల కోసం కన్నకూతుళ్లను వేలం వేస్తున్న తల్లిదండ్రులు..


ఝార్ఖండ్‌లోని పలాముకు చెందిన సునీల్ భుయాన్ అనే వ్యక్తికి 13 నెలల క్రితం మణితా కుమారితో వివాహం జరిగింది. నిజానికి అంతకు ముందే మణిత వేరే వ్యక్తిని ప్రేమించింది. అతడితో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించలేదు. సునీల్‌కు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి తర్వాత కూడా మణిత తన ప్రేమికుడితో ఫోన్‌ ద్వారా టచ్‌లో ఉంది. ఈ నెల 17వ తేదీ రాత్రి వారిద్దరూ కలిసి సునీల్‌పై ఘాతుకానికి పాల్పడ్డారు. మణిత ముందుగా తన భర్తకు ఆహారంలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చింది. సునీల్ నిద్రపోయాక ఒక బ్లేడుతో అతడి మర్మాంగాన్ని కోసేసింది. 


సునీల్ కేకలు విన్న కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, మణితపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మణితను రామ్‌గఢ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా, తన భర్త పురుషాంగాన్ని కత్తిరించినట్లు ఆమె అంగీకరించింది.

Updated Date - 2022-06-23T01:08:42+05:30 IST