భర్త సోదరుడి ప్రైవేట్ భాగాన్ని కొరికేసిన మహిళ.. కారణమేంటో తెలిస్తే షాక్!

ABN , First Publish Date - 2022-03-08T21:24:47+05:30 IST

ఆమెకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.. పెళ్లి జరిగిన ఏడాదికే భర్తకు మానసిక సమస్యలు తలెత్తాయి..

భర్త సోదరుడి ప్రైవేట్ భాగాన్ని కొరికేసిన మహిళ.. కారణమేంటో తెలిస్తే షాక్!

ఆమెకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.. పెళ్లి జరిగిన ఏడాదికే భర్తకు మానసిక సమస్యలు తలెత్తాయి.. దీంతో ఆ మహిళ తన భర్త సోదరుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. భర్త, అత్తమామల ఎదురుగానే బావగారితో కలిసి తిరిగేది.. సోమవారం సాయంత్రం ఆ వ్యక్తి తన గదిలో అపస్మారక స్థితిలో కనిపించాడు.. అతని జననాంగం నుంచి రక్తస్రావం అవుతోంది.. ఆ పక్కనే పడి ఉన్న మహిళ చేతి నుంచి కూడా రక్తస్రావం అవుతోంది.. దీంతో కుటుంబ సభ్యులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు.


ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో బిల్హౌర్ గ్రామానికి చెందిన విమల్ అనే వ్యక్తి నాలుగేళ్ల క్రితం రాధ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి జరిగిన ఏడాదికి విమల్‌కు మానసిక సమస్యలు తలెత్తాయి. దాంతో విమల్ సోదరుడు రాజేష్‌తో రాధ వివాహేతర సంబంధం పెట్టుకుంది. గత రెండేళ్లుగా వీరి మధ్య అఫైర్ కొనసాగుతోంది. కాగా, ఇటీవలి కాలంలో రాధను రాజేష్ పట్టించుకోవడం మానేశాడు. 


ఆ విషయమై రాధ, రాజేష్ మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో సోమవారం ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో రాజేష్ జననాంగాన్ని రాధ తన పళ్లతో కొరికేసింది. అనంతరం ఓ కత్తితో తన మణికట్టును కోసేసుకుంది. కుటుంబ సభ్యులు చూసేసరికి ఇద్దరూ అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే వీరిని కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.   

Updated Date - 2022-03-08T21:24:47+05:30 IST