మూడు నెలల తర్వాత సమాధి నుంచి మృతదేహం బయటకు.. అసలు విషయం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-05-12T08:46:03+05:30 IST

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మూడు నెలల తర్వాత ఓ మహిళ మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీశారు.. ఆ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు.. తమ కూతురి మరణం విషయంలో అనుమానాలున్నాయని తల్లిదండ్రులు...

మూడు నెలల తర్వాత సమాధి నుంచి మృతదేహం బయటకు.. అసలు విషయం ఏంటంటే..

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మూడు నెలల తర్వాత ఓ మహిళ మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీశారు.. ఆ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు.. తమ కూతురి మరణం విషయంలో అనుమానాలున్నాయని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఈ రకమైన ఆదేశాలు ఇచ్చారు.. ఉత్తరప్రదేశ్‌లోని మొరేదాబాద్‌లో ఈ ఘటన జరిగింది. 


వివరాల్లోకి వెళితే.. మొరేదాబాద్‌కు సమీపంలోని భగత్‌పురాకు చెందిన లక్‌పత్ సింగ్ అనే వ్యక్తి తన కూతురిని బార్కేడా గ్రామానికి చెందిన యువకుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. మూడు నెలల కిందట ఆ యువతి చనిపోయింది. అత్తమామలు ఆ విషయం లక్‌పత్ సింగ్‌కు ఫోన్ చేసి చెప్పారు. లక్‌పత్ సింగ్ తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లేటప్పటికే అతని కూతురికి భర్త, అత్తమామలు కలిసి అంత్యక్రియలు పూర్తి చేసేశారు. ఆ సమయంలో ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. 


మూడు నెలల అనంతరం తమ కూతురి మృతిపై అనుమానాలున్నాయని లక్‌పత్ సింగ్ జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించాడు. వరకట్నం వేధింపుల్లో భాగంగానే అల్లుడు, అతని తల్లిదండ్రులు తన కూతురిని చంపేశారని పేర్కొన్నాడు. దీంతో జిల్లా కలెక్టర్ లక్‌పత్ సింగ్ కూతురి మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టమ్ నిర్వహించాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టమ్‌కు పంపించారు. పోస్ట్‌మార్టమ్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

Read more