పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లి.. రెండేళ్ల కొడుక్కి విపరీతంగా నొప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్లాక అసలు నిజం తెలిసి..

ABN , First Publish Date - 2022-06-01T21:18:18+05:30 IST

భర్త చనిపోవడంతో ఆ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తోంది.. తను కూలి పనికి వెళుతూ ముగ్గురినీ పోషిస్తోంది..

పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లి.. రెండేళ్ల కొడుక్కి విపరీతంగా నొప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్లాక అసలు నిజం తెలిసి..

భర్త చనిపోవడంతో ఆ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తోంది.. తను కూలి పనికి వెళుతూ ముగ్గురినీ పోషిస్తోంది.. పెద్ద పిల్లలిద్దరూ చదువుకుంటుండగా చిన్నవాడైన రెండేళ్ల బాలుడు మాత్రం ఇంటి దగ్గరే ఉండేవాడు.. ఈ నెల 26వ తేదీన తల్లి పని నుంచి వచ్చే సరికి ఆ బాలుడు నొప్పితో విలవిలలాడుతూ కనిపించాడు.. దీంతో తల్లి వెంటనే ఆ బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లింది.. పరీక్షించిన వైద్యులు అతడి రెండు కాళ్లూ ఫ్రాక్చర్ అయినట్టుచెప్పారు.. తన వస్తువులతో ఆడుకుంటున్నాడనే కోపంతో పక్కింటి మహిళ ఆ కుర్రాడి కాళ్లు విరిచేసింది. 


ఇది కూడా చదవండి..

ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న యువతి.. సరిగ్గా 3 రోజుల తర్వాత యువతి అరెస్ట్.. ఇంతకీ ఆమె చేసిన నేరం ఏంటంటే..


ముంతాజ్ షేక్ అనే మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ముంబైలోని ఓ బస్తీలో నివసిస్తోంది. తల్లి పనికి, అన్నయ్యలు స్కూలుకి వెళ్లిపోయాక, చిన్నవాడైన కైఫ్ ఇంటి దగ్గరే ఆడుకుంటూ ఉండేవాడు. అప్పుడప్పుడు పక్కింట్లో ఉండే జరీనా షేక్ ఇంటికి వెళ్లేవాడు. ఈ నెల 26వ తేదీన జరీనా ఇంట్లోకి వెళ్లిన కైఫ్.. అక్కడి వస్తువులతో ఆడుకోవడం ప్రారంభించాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన జరీనా.. ఆ బాలుడిని చితక్కొట్టింది. రెండు కాళ్లూ విరిచేసింది. 


పనికి వెళ్లిన ముంతాజ్ తిరిగి ఇంటికి వచ్చే సరికి ఆ బాలుడు నొప్పితో విలవిలలాడుతూ కనిపించాడు.. దీంతో తల్లి వెంటనే ఆ బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఎక్స్ రే తీసిన వైద్యుడు.. కైఫ్ రెండు కాళ్లకూ ఫ్రాక్చర్ అయినట్టు చెప్పాడు. కొడుకు నుంచి విషయం తెలుసుకున్న ముంతాజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జరీనాను అరెస్ట్ చేశారు. 

Updated Date - 2022-06-01T21:18:18+05:30 IST