ఒంటరి గదిలో ప్రియురాలికి దోశ తినిపిస్తోన్న ప్రియుడు.. అంతలో ఉన్నట్టుండి ఊహించని ఘటన.. చివరికి ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-02-27T01:48:53+05:30 IST

వివాహమైన ఆ వ్యక్తి.. ఓ రోజు ప్రియురాలితో గదిలో ఒంటరిగా ఉన్నాడు. ఇద్దరూ కుశల ప్రశ్నలు వేసుకుంటూ మరోవైపు ఒకరికొకరు దోశ తినిపించుకుంటున్నారు. ఇంతలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటుచేసుకుంది..

ఒంటరి గదిలో ప్రియురాలికి దోశ తినిపిస్తోన్న ప్రియుడు.. అంతలో ఉన్నట్టుండి ఊహించని ఘటన.. చివరికి ఏం జరిగిందంటే..
ప్రతీకాత్మక చిత్రం

కొందరు సాఫీగా సాగుతున్న జీవితాన్ని చేజేతులా సర్వనాశనం చేసుకుంటూ ఉంటారు. అన్ని సౌకర్యాలూ ఉన్నా  ఏవో కావాలని ఆశించి.. చివరికి అందరిలో నవ్వులపాలవుతుంటారు. జరగాల్సిన నష్టం జరిగాక తప్పు తెలుసుకున్నా ప్రయోజనం ఉండదు. ఇలాంటి ఎన్నో ఘటనలు ఇటీవల చూస్తూనే ఉన్నాం. ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి విషయంలో ఇలాగే జరిగింది. వివాహమైన ఆ వ్యక్తి.. ఓ రోజు ప్రియురాలితో గదిలో ఒంటరిగా ఉన్నాడు. ఇద్దరూ కుశల ప్రశ్నలు వేసుకుంటూ మరోవైపు ఒకరికొకరు దోశ తినిపించుకుంటున్నారు. ఇంతలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 


ఉత్తరప్రదేశ్ బాండా జిల్లాకు చెందిన ఆనంద్ విశ్వకర్మ.. ప్రభుత్వ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌లో జూనియర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. మంచి ఉద్యోగం, జీతం వస్తుండడంతో భార్యతో సంతోషంగా జీవించేవాడు. ఏ సమస్యలూ లేవనుకుంటున్న తరుణంలో ఊహించని సమస్యలు వచ్చిపడ్డాయి. మంచి భార్య దొరింకిందని సంతోష పడకుండా.. పరాయి మహిళపై ప్రేమ పెంచుకున్నాడు. రోజూ భార్యకు తెలీకుండా ప్రియురాలితో గడిపేవాడు. ఇటీవల భర్త ప్రవర్తనలో మార్పు రావడంతో భార్యకు అనుమానం కలిగింది. ఈ క్రమంలో ఓ రోజు విశ్వకర్మ తన ప్రియురాలితో కలిసి గదిలో ఒంటరిగా ఉన్నాడు. ఇద్దరూ కుశలప్రశ్నలు వేసుకుంటూ మరోవైపు దోశెలు తినిపించుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇంతలో తలుపు కొట్టిన శబ్ధం వినిపించింది. తెరిచి చూడగా.. ఎదురుగా భార్య, మరి కొందరు కనిపించడంతో విశ్వకర్మ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అప్పటికే ఆవేశంతో ఉన్న అతడి భార్య, బంధువులు కలిసి.. విశ్వకర్మ, అతడి ప్రియురాలిని చితకబాదారు. తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. ఈ వార్త స్థానికంగా సంచలనం కలిగించింది.

వేగంగా వెళ్లి భార్యను ఆలింగనం చేసుకున్న భర్త.. ఆ వెంటనే తన ఛాతి మీద చేయి పెట్టుకున్నాడు.. తర్వాత ఊహించని విధంగా..

Updated Date - 2022-02-27T01:48:53+05:30 IST