భర్త గొంతు కొరికి మరీ చంపేసి 10 నెలల కుమార్తెతో భార్య అదృశ్యం.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-04-25T18:08:17+05:30 IST

ఆ మహిళకు రెండేళ్ల కిందట వివాహం జరిగింది.. ఏడాది తర్వాత ఓ కూతురికి జన్మనిచ్చింది..

భర్త గొంతు కొరికి మరీ చంపేసి 10 నెలల కుమార్తెతో భార్య అదృశ్యం.. అసలేం జరిగిందంటే..

ఆ మహిళకు రెండేళ్ల కిందట వివాహం జరిగింది.. ఏడాది తర్వాత ఓ కూతురికి జన్మనిచ్చింది.. వివాహం తర్వాత ఉమ్మడి కుటుంబంలోకి అడుగు పెట్టిన ఆ యువతి తరచుగా గొడవలకు దిగేది.. ఇంట్లో అందరితోనూ ఘర్షణ పడేది.. భర్తతో అయితే నిత్యం వాగ్వాదానికి దిగేది.. ఆదివారం కూడా భార్యాభర్తల మధ్య ఎప్పటిలాగానే గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళ భర్త గొంతు కొరికి చంపేసి పారిపోయింది. 


బీహార్‌లోని రోహ్‌తాస్ జిల్లా బర్నా గ్రామానికి చెందిన మహర్షి అనే వ్యక్తి 2020లో లవ్లీ సింగ్ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వీరికి పది నెలల కూతురు కూడా ఉంది. వివాహం తర్వాత ఉమ్మడి కుటుంబంలోకి అడుగు పెట్టిన ఆ యువతి అక్కడి వారితో తరచుగా గొడవ పడేది. భర్తతో సహా ఎవరితోనూ సఖ్యంగా ఉండేది కాదు. దురుసు స్వభావం కలిగిన లవ్లీ సింగ్ తరచుగా ఇంట్లో వాళ్లందరినీ టెన్షన్ పెడుతుండేది. 


ఆదివారం మధ్యాహ్నం ఎప్పటిలాగానే భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ పెద్దది కావడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన లవ్లీ సింగ్ తన భర్త గొంతు కొరికేసింది. దాంతో మహర్షి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే తన కూతుర్ని తీసుకుని లవ్లీ సింగ్ అక్కడి నుంచి పరారైంది. సోదరుడు చూసేటప్పటికి మహర్షి మరణించాడు. వెంటనే అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లవ్లీ సింగ్ కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2022-04-25T18:08:17+05:30 IST