వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-10-17T04:38:47+05:30 IST
వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం దుబ్బాక మండలం రామక్కపేట మధిర గ్రామమైన ఎల్లాపూర్లో చోటు చేసుకుంది.
దుబ్బాక, అక్టోబరు 16: వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం దుబ్బాక మండలం రామక్కపేట మధిర గ్రామమైన ఎల్లాపూర్లో చోటు చేసుకుంది. దుబ్బాక ఎస్ఐ స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక మున్సిపాలిటిలోని దుంపలపల్లి వార్డుకు చెందిన కుక్కల చంద్రకళ(30) దసరా పండుగ నిమిత్తం తల్గిగారి ఊరైన ఎల్లాపూర్కు వెళ్లింది. గతంలో దుంపలపల్లికి చెందిన ఓ వ్యక్తితో చనువుగా ఉంటుందని పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. శుక్రవారం దుంపలపల్లి వార్డుకు చెందిన సదరు వ్యక్తి ఎల్లాపూర్ గ్రామానికి వెళ్లి చంద్రకళను దూర్భాషలాడడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త రవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు.