పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-11-28T05:51:07+05:30 IST

మండల పరిధిలోని అలువాల గ్రామంలో వడ్డె లక్ష్మి(33)అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య

గోనెగండ్ల, నవంబరు 27: మండల పరిధిలోని అలువాల గ్రామంలో వడ్డె లక్ష్మి(33)అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. అలువాల గ్రామానికి చెందిన వడ్డె రామాంజినేయులుకు పదేళ్ల క్రితం సూగురుకు చెందిన లక్ష్మితో వివాహం జరిగింది. వీరికి రెండు ఎకరాల పొలం ఉంది. పొలంతోపాటు కూలి పని చేసుకొని జీవనం సాగించే వారు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. రామాంజినేయులు మద్యానికి బానిస అయ్యాడు. పంటలు సరిగా పండకపోగా కూలీ నాలీ చేసుకొని వచ్చిన సొమ్ముతో మద్యం తాగేవాడు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారింది. మద్యం మానేయాలని లక్ష్మి చెప్పినా పట్టించుకునేవాడు కాదు. చివరకు లక్ష్మికి జీవితంపై విరక్తి కలిగింది. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు. 

Updated Date - 2021-11-28T05:51:07+05:30 IST