ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-01-23T04:57:07+05:30 IST

మండలంలోని సోమాపురం గ్రామంలో గవిని భారతి (31) అనే మహిళ శనివారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య
భారతి మృతదేహం

చాపాడు, జనవరి 22: మండలంలోని సోమాపురం గ్రామంలో గవిని భారతి (31) అనే మహిళ శనివారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గత పదేళ్ల క్రితం భారతిని నిజమాబాద్‌ జిల్లా ఆర్మూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తికి ఇచ్చి ఆమె తల్లిదండ్రులు వివాహం జరిపించారు. ఏడాదిన్నర క్రితం శ్రీనివాసులు కరోనాతో మృతి చెందాడు. సంక్రాంతి పండుగకు భారతి పుట్టింటికి వచ్చింది. తనకు భర్త లేడు కదా అని ఇక్కడే నివాసం ఉంటానని నిర్ణయించుకుని ఫోన్‌లో తన అత్తతో మాట్లాడి తన ఇద్దరు పిల్లలను పంపించాలని కోరిందన్నారు. ఇందుకు అత్త నిరాకరించడంతోజీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. 

Updated Date - 2022-01-23T04:57:07+05:30 IST