చందాపూర్‌లో ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-05-11T06:16:12+05:30 IST

కడుపునొప్పి భరించలేక ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

చందాపూర్‌లో ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

వర్గల్‌, మే 10: కడుపునొప్పి భరించలేక ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన దండుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చందాపూర్‌ శివారు ప్రాంతంలో ఉన్న ఫౌలీ్ట్రఫాంలో జరిగింది. ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అజయ్‌ అనే వ్యక్తి చందాపూర్‌ శివారు ప్రాంతంలోని ఎల్‌టీఎఫ్‌ ఫాల్ర్టీ ఫాంలో నివాసముంటూ కూలి పని చేస్తున్నాడు. గత నవంబర్‌లో అతడికి  మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లాకు చెందిన చందేరి పాయల్‌(21)తో వివాహం జరిగింది. నాటి నుంచి ఇద్దరు  పౌల్ర్టీఫాం లోనే ఉంటున్నారు.  సోమవారం ఉదయం అజయ్‌ భార్య చందేరి పాయల్‌ కడుపు నొప్పి భరించలేక నివాసముంటున్న గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్‌ఐ పేర్కొన్నారు.  


Updated Date - 2021-05-11T06:16:12+05:30 IST