మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-10-27T05:21:37+05:30 IST

కొలిమిగుండ్ల మండలంలోని బెలుం గ్రామానికి చెందిన తోక జీవమ్మ (44) విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి మంగళవారం తెలిపారు.

మహిళ ఆత్మహత్య


కొలిమిగుండ్ల, అక్టోబరు 26: కొలిమిగుండ్ల మండలంలోని బెలుం గ్రామానికి చెందిన తోక జీవమ్మ (44) విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు  ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి మంగళవారం తెలిపారు.   బెలుం గ్రామానికి చెందిన తోక కంబయ్య భార్య జీవమ్మ  నాలుగు నెలల నుంచి కడుపు నొప్పితో బాధపడుతోంది. ఎన్ని మందులు వాడినా  నయం కాలేదు. సోమవారం రాత్రి కడుపునొప్పిని భరించలేక జీవితంపై విరక్తి చెంది విషద్రావణం తాగి అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబసభ్యులు బనగానపల్లె ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.  భర్త కంబ య్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి తెలిపారు.  

  మండలంలోని కోటపాడు గ్రామానికి చెందిన రాచకుంట తులశమ్మ (35) విషద్రావణం తాగి  ఆత్మహత్యాయత్నం చేసి   మంగళవారం మృతి చెందింది. కోటపాడు గ్రామానికి చెందిన రాజకుంట తులశమ్మ మిరప పంటకు నీళ్లు పట్టే విషయంలో కుమార్తె, అల్లుడు మందలించారని ఈ నెల 23వ తేదీ ఇంట్లో   విషద్రావణం తాగింది.  అపస్మారక స్థితిలో ఉన్న తులశమ్మను కుటుంబ సభ్యులు కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందని ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి తెలిపారు.


Updated Date - 2021-10-27T05:21:37+05:30 IST