మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-11-29T05:07:22+05:30 IST

మండలంలోని ఎదురుపాడు గ్రామానికి చెందిన కుమ్మరి లక్ష్మమ్మ అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడిందని ఆదివారం ఎస్‌ఐ ముబీనాతాజ్‌ తెలిపారు.

మహిళ ఆత్మహత్య


కొత్తపల్లి, నవంబరు 28: మండలంలోని ఎదురుపాడు గ్రామానికి చెందిన కుమ్మరి లక్ష్మమ్మ అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడిందని ఆదివారం ఎస్‌ఐ ముబీనాతాజ్‌ తెలిపారు. భర్త కుమ్మరి హుసేనయ్య, భార్య లక్ష్మమ్మ  తరచూ ఘర్షణ పడేవారని, శనివారం భార్యాభర్తలు మధ్య గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన లక్ష్మమ్మ ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.



Updated Date - 2021-11-29T05:07:22+05:30 IST