కరోనా పాజిటివ్ వచ్చిందని భయంతో మహిళ ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-05-11T17:05:52+05:30 IST
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన ఎగిటల కుమారి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. కరోనా టెస్ట్ చేయించుకోగా..
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన ఎగిటల కుమారి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. కరోనా టెస్ట్ చేయించుకోగా.. కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఆందోళన చెందిన ఆమె ఎవరికీ చెప్పకుండా వెళ్ళి ఇబ్రహీంపట్నం ఎన్టీపీఎస్ కూలింగ్ కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమారి మృతి దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు.