పిల్లలు పుట్టట్లేదని మహిళ ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-02-22T15:46:16+05:30 IST
మేడ్చల్: డబుల్ బెడ్ రూమ్ పదవ అంతస్థుపై నుంచి దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పిల్లలు కలగట్లేదని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.
మేడ్చల్: డబుల్ బెడ్ రూమ్ పదవ అంతస్థుపై నుంచి దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పిల్లలు కలగట్లేదని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీనివాస్నగర్ కాలనీ, నాగారంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న డబుల్ బెడ్ రూంల పైనుంచి దూకి కె. సత్య సంతోషిణి(27) అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పవన్ భగవాన్ అనే వ్యక్తితో మూడేళ్ల క్రితం వివాహమైనా సంతానం కలగకపోవటంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడి మహిళ ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.