నేడు వివాహం.. యువతి ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-06-08T16:34:54+05:30 IST

ద్వారకా తిరుమల మండలం జాజులకుంటలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. నేడు ఓ యువతి వివాహానికి తల్లిదండ్రులు ఏర్పాట్లు చేస్తున్నారు.

నేడు వివాహం.. యువతి ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..

ఏలూరు : ద్వారకా తిరుమల మండలం జాజులకుంటలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ యువతి వివాహానికి నేడు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారు. కాగా.. రాత్రి ఇంట్లో ఉరివేసుకుని యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కొంతకాలం క్రితం ఆమె ఓ యువకుడిని ప్రేమించింది. అనంతరం వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. యువతి వివాహ విషయాన్ని తెలుసుకున్న యువకుడు.. ఆమెతో కలిసి ఉన్న ఫోటోలను పంపించాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఫిర్యాదు లేకపోవడంతో ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదు. 

Updated Date - 2022-06-08T16:34:54+05:30 IST