అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
ABN , First Publish Date - 2022-08-14T05:23:34+05:30 IST
మంగళగిరి నగరంలోని ఎల్బీ న గర్లో శనివారం సాయంకాలం ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.
భర్తే హత్య చేశాడంటూ బంధువుల ఆరోపణ
మంగళగిరి సిటీ, ఆగస్టు 13: మంగళగిరి నగరంలోని ఎల్బీ న గర్లో శనివారం సాయంకాలం ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మంగళగిరి నగరంలోని ఎల్బీ న గర్లో శనివారం సాయంకాలం ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మృతురా లి బంధువులు, పోలీసులు తెలిపి న వివరాల ప్రకారం.. ఎల్బీ న గర్కు చెందిన తోట శ్రీనివాస రావుకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె త్రివేణి(30)కి మంగళగిరి మండలం కాజ గ్రామానికి చెందిన ఇంటూరి శివశంకర్తో 2016లో వివా హమైంది. వివాహ సమయంలో రూ.మూడు లక్షల నగ దు, బంగారం ఇచ్చారు. వీరికి పిల్లలు లేరు. వీరిరువురూ గత కొద్ది నెలలుగా మంగళగిరి ఎల్బీ నగర్లోని త్రివేణి పుట్టింటికి సమీపంలో నివాసం వుంటున్నారు. భర్త శివ శంకర్ పని లేకుండా జులాయిగా తిరుగుతుంటాడు. మ ద్యం తాగే అలవాటున్న శివశంకర్ డబ్బు కోసం తరచు భార్యను వేధిస్తుండేవాడు. అదనపు కట్నం తేవాలని పలుమార్లు హింసించడంతో పుట్టింటి వారు దఫాలుగా రూ.ఐదు లక్షల వరకు ముట్టజెప్పారు. అయినప్పటికీ శివశంకర్ భార్యతో గొడవపడుతూ వేధించసాగాడు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం శివశంకర్ త్రివేణి కుటుంబసభ్యులకు ఫోను చేసి ఆమె ఎంత పిలిచినా పలకడంలేదని, ఒళ్లు చల్లబడిందని చెప్పి మభ్యపెట్టే ప్ర యత్నం చేశాడు. మృతురాలి మెడపై గొంతు నులిమిన గాయాలు ఉండడంతో అనుమానం వచ్చిన త్రివేణి బం ధువులు పోలీసులకు సమాచారం అందించారు. భర్త శివశంకరే తమ కుమార్తెను గొంతు నులిమి చంపాడని త్రివేణితండ్రి శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చే శారు. పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.