పురుగుల మందు తాగి మహిళ మృతి
ABN , First Publish Date - 2021-07-27T04:45:18+05:30 IST
మండల పరిధిలోని బొగ్గులపల్లి గ్రామానికి చెందిన మూడే రామ తులశమ్మ (43) అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసు కున్నట్లు మైలవరం ఎస్ఐ రామకృష్ణ సోమవారం తెలిపారు.
మైలవరం, జూలై 26 : మండల పరిధిలోని బొగ్గులపల్లి గ్రామానికి చెందిన మూడే రామ తులశమ్మ (43) అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసు కున్నట్లు మైలవరం ఎస్ఐ రామకృష్ణ సోమవారం తెలిపారు. గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతూ పలుమార్లు వైద్య చికిత్సలు పొందిందన్నారు. కడుపునొప్పి తాళలేక ఆదివారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో పురుగులమందు తాగగా భర్త తావరేనాయక్ వెంటనే జమ్మలమడుగు హాస్పిటల్కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
వ్యసనాలకు బానిసై యువకుడి ఆత్మహత్య
ఖాజీపేట, జూలై 26: వ్యసనాలకు బానిసై మనస్థాపం చెంది ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు మండల పరిధిలోని మిడుతూరు హరిజనవాడకు చెందిన సి.హెచ్.సంపత్కుమార్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. వ్యసనాలకు బానిపై జీవితంమీద విరక్తి చెంది ఆదివారం రాత్రి ఇంటిలో ఉరి వేసుకుని మృతి చెందాడు. మృతుడి తల్లి లక్ష్మిదేవి గమనించి కమలాపురంలోని ఓ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. ఖాజీపేట ఎస్ఐ కుళాయప్ప సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
రామాపురం, జూలై 26: రోడ్డు ప్రమాదంలో గాయపడి తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్న దేవపట్ల రామరాజు (41) అనే వ్యక్తి సోమవారం మృతి చెందినట్లు ఎస్ఐ జయరాములు తెలిపారు. ఆయన కథనం మేరకు... రామాపురం బీసీ కాలనీకి చెందిన రామరాజు రామాపురం వెళ్లేందుకు బైక్పై రోడ్డుపైకి వస్తుండగా రాయచోటి నుంచి కడపకు వెళ్తున్న కారు శనివారం రాత్రి ఢీకొంది. తీవ్ర గాయాలతో ఉన్న రామరాజును స్థానికుల సహాయంతో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.