చికిత్స పొందుతూ మహిళ మృతి
ABN , First Publish Date - 2022-01-24T05:12:27+05:30 IST
చికిత్స పొందుతూ మహిళ మృతి
- ఆర్ఎంపీ నిర్లక్ష్యం వల్లేనని కుటుంబీకుల ఆందోళన ఆర్ఎంపీ ఇంటి వద్ద ఆందోళన
పరిగి, జనవరి 23: ఆర్ఎంపీ వైద్యం వల్లే మహిళ మృతిచెం దిం దని ఆమె కుటుంబీకు లు ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పరి గికి చెందిన తస్లిం(34) అనారోగ్యంతో శనివారం రాత్రి పరిగిలోని ఓ ఆర్ఎంపీ వద్దకు ట్రీట్మెంట్ కోసం వెళ్లింది. సదరు ఆర్ఎంపీ వచ్చీరానీ వైద్యం చేయడంతో ఆమె ఆరోగ్యం విషమించింది. ఆమెను తీసుకెళ్లమని ఆర్ఎంపీ చెప్పడంతో ఉస్మానియాకు తరలించగా అప్పటికే మృతిచెందిందని వైద్యులు ధ్రువీకరించారు. ఆర్ఎంపీ నిర్లక్ష్యం వల్లే తస్లిం మృతిచెందిందని ఆదివారం ఆమె బంధువులు ఆర్ఎంపీ ఇంటి వద్ద ఆందోళన చేశారు. ఆర్ఎంపీపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా.. కొందరు వ్యక్తులు మధ్యవర్తులు మాట్లాడి వారి మధ్య రాజీ కుదిర్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా.. మహిళ మృతిపై తమకు ఫిర్యాదు రాలేదన్నారు. అంత గొడవ వారి దృష్టికి రాకపోవడం గమనార్హం.