చికిత్స పొందుతూ మహిళ మృతి

ABN , First Publish Date - 2022-06-27T06:50:13+05:30 IST

జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవే టు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు దిగారు.

చికిత్స పొందుతూ మహిళ మృతి
మృతదేహం వద్ద మృతురాలి బంధువుల రోదనలు

 ఆస్పత్రి ఎదుట మృతదేహంతో బంధువుల ధర్నా 

నల్లగొండ, జూన 26: జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవే టు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఆదివారం రా త్రి చోటుచేసుకుంది. కనగల్‌ మండలం తే లకంటిగూడెం గ్రామానికి చెందిన నీలమ్మ అనే 7 నెలల గర్భిణీ పట్టణంలోని నవ్య ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చే రింది. రక్తస్రావం కావడంతో ఆమె మృతి చెందినట్లు సమాచారం. ఆస్పత్రి వైద్యు ల నిర్లక్ష్యం వల్లే వైద్యం వికటించి నీల మ్మ మృతి చెందిందని, బంధువులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని గొడవలు జరగకుండా చూశారు. ఆ స్పత్రి యాజమాన్యం మాత్రం వైద్యం బాగానే అందించామని, తమ వైద్యంలో ఎలాంటి లోపాలు లేవని పేర్కొన్నారు. 


Updated Date - 2022-06-27T06:50:13+05:30 IST