మద్యం సేవించి భర్తను హత్య చేసిన భార్య.. ఆమె కోపానికి కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-03-07T05:48:42+05:30 IST

రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో భర్తను చంపిన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. భర్తను చితక్కొట్టి అతడి మెడకు బెల్ట్ బిగించి ఉరేసి చంపేసింది...

మద్యం సేవించి భర్తను హత్య చేసిన భార్య.. ఆమె కోపానికి కారణం ఏంటంటే..

రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో భర్తను చంపిన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. భర్తను చితక్కొట్టి అతడి మెడకు బెల్ట్ బిగించి ఉరేసి చంపేసింది. మత్తు దిగిన తర్వాత పోలీసుల ఎదుట నిజం అంగీకరించింది. 


వివరాల్లోకి వెళితే.. బార్మర్ జిల్లాలోని కొత్వాల్ ప్రాంతానికి చెందిన అనిల్, మంజు అనే భార్యాభర్తలు తరచుగా మద్యం సేవిస్తుంటారు. వారానికి రెండు మూడు సార్లు కలిసే మందు కొడుతుంటారు. గురువారం రాత్రి కూడా ఇద్దరూ మద్యం సేవించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆ తర్వాత మత్తు బాగా ఎక్కడంతో అనిల్ నిద్రలోకి జారుకున్నాడు. 


భర్త మీద తీవ్ర ఆగ్రహం చెందిన మంజు అతను నిద్రపోయిన తర్వాత మెడకు బెల్ట్ బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. మరుసటి రోజు ఉదయం అనిల్ మృతదేహం చూసి అతడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంజును అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఎదుట మంజు నిజం అంగీకరించింది. ప్రస్తుతం మంజును పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2022-03-07T05:48:42+05:30 IST