నిద్రించేందుకు పడక గదికి వెళ్లిన మహిళకు షాక్.. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 18..!

ABN , First Publish Date - 2021-07-16T23:31:00+05:30 IST

నిద్రించేందుకు పడక గదికి వెళ్లిన మహిళ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తన బెడ్రూంలోని పరుపు కింద పదుల సంఖ్యలో ఉన్న పాములను చూసి కంగుతింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట చక్కర్లు

నిద్రించేందుకు పడక గదికి వెళ్లిన మహిళకు షాక్.. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 18..!

వాషింగ్టన్: నిద్రించేందుకు పడక గదికి వెళ్లిన మహిళ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తన బెడ్రూంలోని పరుపు కింద పదుల సంఖ్యలో ఉన్న పాములను చూసి కంగుతింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికా జార్జియా రాష్ట్రంలోని అగస్టా ప్రాంతంలో ట్రిస్ విల్చర్ అనే మహిళ తన భర్తతో కలిసి నివాసం ఉంటోంది. ఈ క్రమంలో సదరు మహిళ రాత్రి సమయంలో నిద్ర పోవడానికి బెడ్‌ రూంకు వెళ్లింది. బెడ్ సర్దుతుండటా ఏదో శబ్దం రావడంతో గదిలోని ఫ్లోర్‌ను నిశితంగా పరిశీలించింది. ఈ నేపథ్యంలో ఆమెకు పాము పిల్ల కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయింది. 



అనంతరం కేకలు వేయడంతో వెంటనే ఆమె భర్త బెడ్‌రూంలోకి వచ్చి పాము పిల్లను చూశాడు. ఈ క్రమంలో బెడ్‌రూంలో ఇంకా పాము పిల్లలు ఉన్నాయేమో అనే అనుమానంతో పరుపును పైకెత్తి చూశాడు. బెడ్ కింద తల్లిపాముతో సహా మొత్తం 17 పాములు ఉండటంతో దంపతులు ఇద్దరూ కంగుతిన్నారు. ఆ తర్వాత చాకచక్యంగా ఆ పాములను ఓ సంచీలో బంధించి.. దగ్గర్లో ఉన్న అడవిలో విడిచిపెట్టారు. కాగా.. విషయం తెలుసుకున్న రెస్క్యూ అధికారులు.. ట్రిస్ విల్చర్ ఇంటికి చేరుకుని ఇల్లంతా జల్లెడ పట్టారు. అనంతరం ఇంట్లో పాములు లేవని చెప్పడంతో ఆ దంపతులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. పాముల ఫొటోతోపాటు తనకు ఎదురైన అనుభవాన్ని ట్రిస్ విల్చర్ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.  


Updated Date - 2021-07-16T23:31:00+05:30 IST