మహిళ బలవన్మరణం
ABN , First Publish Date - 2021-07-27T06:56:11+05:30 IST
ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంస్థాన్ నారాయణపురానికి చెందిన మారగోని రాములు కుమార్తె పారిజాత(25)కు ఇదే గ్రామానికి చెందిన ఎడ్ల మల్లేష్తో ఆరేళ్ల క్రితం వివాహమైంది.
సంస్థాన్ నారాయణపురం, జూలై 26: ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంస్థాన్ నారాయణపురానికి చెందిన మారగోని రాములు కుమార్తె పారిజాత(25)కు ఇదే గ్రామానికి చెందిన ఎడ్ల మల్లేష్తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏడాది కాలంగా పారిజాతకు మానసిక పరిస్థితి సరిగా లేదు. 20రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. తల్లిదండ్రులు వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా, ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని మృతి చెందింది. తల్లిదండ్రులు పొలం నుంచి ఇంటికి వచ్చి కుమార్తె మృతదేహాన్ని చూసి విలపించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.