Bihar: మరిదితో లవ్ అఫైర్.. భర్తను అడ్డు తప్పించేందుకు ఆమె ఎలాంటి మాస్టర్ ప్లాన్ వేసిందంటే..
ABN , First Publish Date - 2022-08-03T23:40:04+05:30 IST
వివాహేతర సంబంధాల వల్ల జరుగుతున్న అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు.. వివాహేతర సంబంధాలు ఎన్నో జీవితాలను నాశనం చేస్తున్నాయి.
వివాహేతర సంబంధాల వల్ల జరుగుతున్న అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు.. వివాహేతర సంబంధాలు ఎన్నో జీవితాలను నాశనం చేస్తున్నాయి.. మరెంతో మంది మరణాలకు కారణమవుతున్నాయి.. బీహార్కు (Bihar) చెందిన ఓ మహిళ తన భర్త సోదరుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. అడ్డు వస్తున్న భర్తను తప్పించేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది.. రూ. లక్ష సుపారీ ఇచ్చి చంపించేసింది.. చివరకు పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలైంది.. బీహర్లోని గోపాల్పూర్లో ఈ ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి..
Haryana Cop With Axe: గొడ్డలితో రెచ్చి పోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. నడిరోడ్డుపై వీరంగం!
పప్పు గుప్తా, ప్రీతి గుప్తా అనే దంపతులు గోపాల్పూర్లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరితో పాటు.. భర్త సోదరుడు కూడా వారి ఇంట్లోనే ఉండేవాడు. భర్త తరచుగా బిజినెస్ టూర్లకు వెళుతుండడంతో ప్రీతి గుప్తా తన మరిదితో వివాహేతర సంబంధం (Extra marital affair) పెట్టుకుంది. భర్త టూర్కు వెళ్లగానే ఇద్దరూ కలసి గడిపేవారు. అయితే తమ గుట్టు ఎక్కడ భర్తకు తెలిసిపోతుందో అని అనుక్షణం భయపడుతుండేవారు. పప్పును అడ్డు తొలగించుకుంటే తాము స్వేచ్ఛగా ఉండొచ్చని భావించారు. అందుకు ప్రీతి గుప్తా మాస్టర్ ప్లాన్ వేసింది.
పప్పు గుప్తాను చంపాల్సిందిగా కొందరు వ్యక్తులతో ప్రీతి లక్షరూపాయలకు డీల్ మాట్లాడుకుంది. రూ.20 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చింది. జూలై 26న పప్పు టూర్ ముగించుకుని ఇంటికి వస్తుండగా కొంత మంది అతడిని అడ్డుకుని తుపాకీతో కాల్చి చంపారు. రోడ్డుపై మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రీతి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమె కాల్ డేటాను పరిశీలించారు. చివరకు ఆమె నిజం అంగీకరించింది. దీంతో ప్రీతిని, ఆమె మరిదిని పోలీసులు అరెస్ట్ చేశారు.