ఇద్దరు పిల్లలను చంపి తాను ఉరి వేసుకున్న తల్లి

ABN , First Publish Date - 2021-03-05T17:28:05+05:30 IST

పుట్టింటికి వెళ్లే విషయంలో భర్తతో జరిగిన వాగ్వాదంతో భార్య తన ఇద్దరు పిల్లలను చంపి, తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన....

ఇద్దరు పిల్లలను చంపి తాను ఉరి వేసుకున్న తల్లి

న్యూఢిల్లీ: పుట్టింటికి వెళ్లే విషయంలో భర్తతో జరిగిన వాగ్వాదంతో భార్య తన ఇద్దరు పిల్లలను చంపి, తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన ఢిల్లీ నగరంలోని షాకూర్‌పూర్ ప్రాంతంలో గురువారం రాత్రి జరిగింది. బీహార్ రాష్ట్రంలోని మధుమనీ ప్రాంతానికి చెందిన దంపతులకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. తన స్వస్థలమైన మధుబనీకి వెళ్లే విషయంలో భార్యా భర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం భర్త ఆఫీసుకు వెళ్లి రాత్రికి తిరిగివచ్చాడు. భర్త ఇంటికి వచ్చి చూస్తే భార్య ఉరివేసుకొని కిటికీలో నుంచి కనిపించింది. స్థానికుల సహకారంతో భర్త తలుపు పగులగొట్టి చూడగా ఇద్దరు పిల్లలు కూడా మరణించి ఉన్నారు. ఇద్దరు పిల్లలను చంపిన తల్లి తాను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెప్పారు.పోలీసులు తల్లీ పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఢిల్లీ డీసీపీ ఉషా రంగినేని చెప్పారు.

Updated Date - 2021-03-05T17:28:05+05:30 IST